AP Schools, Posts, Staff(Teachers) Rationalization Norms/Guidelines: AP School Posts, Staff, Teachers rationalization norms and guidelines, AP GO.No.29 AP Teachers, AP Schools staff rationalization norms, AP Primary, UP, High schools rationalization guidelines and norms, AP Schools and Teachers rationalization guidelines, One class-One teacher. AP GO.29 ~ AP Schools, Posts, Staff(Teachers) Rationalization Norms/Guidelines: Norms for Rationalisation of Schools, Posts and Staff under various managements (viz.) Government, Zilla Parishad, Mandal Parishad Schools in AP.
ఏపీ పాఠశాలల హేతుబద్ధీకరణకు మార్గదర్శకాలు రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని పాఠశాలల విలీనం... మరికొన్ని మూత. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం. ఏపీలో విద్యాశాఖ పాఠశాలల హేతుబద్దీకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 20మందిలోపు విద్యార్థులు ఉండే పాఠశాలలను కిలోమీటరులోపు దూరంలో ఉండే పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. కిలోమీటరు దూరంలో లేకపోతే వాటిని కొనసాగిస్తారు. 50లోపు ఉండే ఒకే మాధ్యమ హైస్కూళ్లు, 30 మంది లోపు ఉండే ప్రాథమికోన్నత (6-7తరగతులు), 40 విద్యార్థులులోపు ఉండే (6-8తరగతులు) పాఠశాలలను మూసివేస్తారు. అధికారుల తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 9వేల వరకు పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ప్యాఫ్టో ప్రధాన కార్యదర్శి హృదయరాజు ఆరోపించారు. ఉన్నత పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు మించితే రెండో పీఈటీ ఇవ్వాలన్న ప్రభుత్వం పట్టించుకోలేదనిఎమ్మెల్సీ కత్తినర్సింహరెడ్డి పేర్కొన్నారు.
హేతుబద్ధీకరణను ఇలా చేస్తారు
340 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రతి 30మందికి ఒక ఎస్జీటీ పోస్టును ఇస్తారు. హేతుబద్ధీకరణ పూర్తయిన తర్వాత మిగులు ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులను 80లోపు విద్యార్థులు ఉండే ప్రాథమిక పాఠశాలకు మరో పోస్టు చొప్పున కేటాయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఇంకా మిగులు ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి వద్ద భవిష్యత్తు అవసరాలకు ఉంచుతారు. హేతుబద్ధీకరణ చేసిన పాఠశాలలో మిగిలే ఎస్జీటీల్లో జూనియర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తారు. ఇది ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి, బదిలీల నిబంధనల ప్రకారం ఉంటుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలను తగ్గించేందుకు విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది.
ఎస్సీ, ఎస్టీల నివాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో 10మందిలోపు విద్యార్థులు ఉండి, పక్క పాఠశాలలో విలీనం చేసేందుకు అవకాశం లేని సమయంలో వీటిని కొనసాగిస్తారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాలు రెండు కలిసి ఉండే పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల ఆధారంగా కాకుండా అయా మాధ్యమాల ఆధారంగా ఉపాధ్యాయులను హేతుబద్దీకరిస్తారు. ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు, కొండలు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలను హేతుబద్ధీకరణ నుంచి మినహాయిస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలలు 6-7, 6-8లలో 30లోపు, 40లోపు విద్యార్థులు ఉంటే స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేస్తారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలిపేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-7తరగతుల్లో 60మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వాటి స్థాయిని పెంచి హైస్కూల్గా మార్పు చేస్తారు. ఇక్కడ ఈ ఏడాది నుంచే 8వ తరగతిని ప్రారంభిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-8 తరగతుల్లో 80కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వీటిని ఉన్నత పాఠశాల స్థాయికి పెంచుతారు. ఈ ఏడాదే 9వతరగతి ప్రారంభిస్తారు. మూడు కిలోమీటర్ల లోపు హైస్కూల్ లేకపోతేనే దీన్ని అమలు చేస్తారు.
50లోపు విద్యార్థులు ఉండే జిల్లాపరిషత్తు పాఠశాలను హేతుబద్దీకరిస్తారు. 51-240 విద్యార్థులు ఉంటే కనీస సిబ్బందిని నియమిస్తారు. తొమ్మిది మంది సబ్జెక్టు ఉపాధ్యాయులను ఇస్తారు. 1200-1240మంది విద్యార్థులు ఉంటే ప్రతి అదనపు 35 మంది విద్యార్థులకు ఒక పాఠశాల సహాయకుడిని కేటాయిస్తారు. సక్సెస్ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 50లోపు విద్యార్థులు ఉంటే రెండు మాధ్యమాలను కలిపేస్తారు. స్థానిక పాఠశాల నిర్వాహ కమిటీ నిర్ణయం మేరకు ఏదో ఒక మాధ్యమాన్ని కొనసాగిస్తారు.
ఆంగ్ల మాధ్యమ సక్సెస్ పాఠశాలల్లో 50-140మంది ఉంటే నలుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 141-240 విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయమ ఉపాధ్యాయుడు పోస్టులు మినహా మిగతా వాటిని ఇస్తారు. 500 మంది విద్యార్థులు మించితే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయమ ఉపాధ్యాయుడును ఇస్తారు. ఇతర భాషామాధ్యమ పాఠశాలల్లో 50మంది లోపు విద్యార్థులు ఉంటే వాటిని హేతుబద్దీకరిస్తారు. ప్రతి పాఠశాలలోనూ అయా భాషల పాఠశాల సహాయకులను ఉంచుతారు.
ఏపీ పాఠశాలల హేతుబద్ధీకరణకు మార్గదర్శకాలు రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని పాఠశాలల విలీనం... మరికొన్ని మూత. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం. ఏపీలో విద్యాశాఖ పాఠశాలల హేతుబద్దీకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 20మందిలోపు విద్యార్థులు ఉండే పాఠశాలలను కిలోమీటరులోపు దూరంలో ఉండే పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. కిలోమీటరు దూరంలో లేకపోతే వాటిని కొనసాగిస్తారు. 50లోపు ఉండే ఒకే మాధ్యమ హైస్కూళ్లు, 30 మంది లోపు ఉండే ప్రాథమికోన్నత (6-7తరగతులు), 40 విద్యార్థులులోపు ఉండే (6-8తరగతులు) పాఠశాలలను మూసివేస్తారు. అధికారుల తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 9వేల వరకు పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ప్యాఫ్టో ప్రధాన కార్యదర్శి హృదయరాజు ఆరోపించారు. ఉన్నత పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు మించితే రెండో పీఈటీ ఇవ్వాలన్న ప్రభుత్వం పట్టించుకోలేదనిఎమ్మెల్సీ కత్తినర్సింహరెడ్డి పేర్కొన్నారు.
హేతుబద్ధీకరణను ఇలా చేస్తారు
340 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రతి 30మందికి ఒక ఎస్జీటీ పోస్టును ఇస్తారు. హేతుబద్ధీకరణ పూర్తయిన తర్వాత మిగులు ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులను 80లోపు విద్యార్థులు ఉండే ప్రాథమిక పాఠశాలకు మరో పోస్టు చొప్పున కేటాయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఇంకా మిగులు ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి వద్ద భవిష్యత్తు అవసరాలకు ఉంచుతారు. హేతుబద్ధీకరణ చేసిన పాఠశాలలో మిగిలే ఎస్జీటీల్లో జూనియర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తారు. ఇది ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి, బదిలీల నిబంధనల ప్రకారం ఉంటుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలను తగ్గించేందుకు విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది.
ఎస్సీ, ఎస్టీల నివాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో 10మందిలోపు విద్యార్థులు ఉండి, పక్క పాఠశాలలో విలీనం చేసేందుకు అవకాశం లేని సమయంలో వీటిని కొనసాగిస్తారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాలు రెండు కలిసి ఉండే పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల ఆధారంగా కాకుండా అయా మాధ్యమాల ఆధారంగా ఉపాధ్యాయులను హేతుబద్దీకరిస్తారు. ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు, కొండలు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలను హేతుబద్ధీకరణ నుంచి మినహాయిస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలలు 6-7, 6-8లలో 30లోపు, 40లోపు విద్యార్థులు ఉంటే స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేస్తారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలిపేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-7తరగతుల్లో 60మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వాటి స్థాయిని పెంచి హైస్కూల్గా మార్పు చేస్తారు. ఇక్కడ ఈ ఏడాది నుంచే 8వ తరగతిని ప్రారంభిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-8 తరగతుల్లో 80కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వీటిని ఉన్నత పాఠశాల స్థాయికి పెంచుతారు. ఈ ఏడాదే 9వతరగతి ప్రారంభిస్తారు. మూడు కిలోమీటర్ల లోపు హైస్కూల్ లేకపోతేనే దీన్ని అమలు చేస్తారు.
50లోపు విద్యార్థులు ఉండే జిల్లాపరిషత్తు పాఠశాలను హేతుబద్దీకరిస్తారు. 51-240 విద్యార్థులు ఉంటే కనీస సిబ్బందిని నియమిస్తారు. తొమ్మిది మంది సబ్జెక్టు ఉపాధ్యాయులను ఇస్తారు. 1200-1240మంది విద్యార్థులు ఉంటే ప్రతి అదనపు 35 మంది విద్యార్థులకు ఒక పాఠశాల సహాయకుడిని కేటాయిస్తారు. సక్సెస్ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 50లోపు విద్యార్థులు ఉంటే రెండు మాధ్యమాలను కలిపేస్తారు. స్థానిక పాఠశాల నిర్వాహ కమిటీ నిర్ణయం మేరకు ఏదో ఒక మాధ్యమాన్ని కొనసాగిస్తారు.
ఆంగ్ల మాధ్యమ సక్సెస్ పాఠశాలల్లో 50-140మంది ఉంటే నలుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 141-240 విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయమ ఉపాధ్యాయుడు పోస్టులు మినహా మిగతా వాటిని ఇస్తారు. 500 మంది విద్యార్థులు మించితే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయమ ఉపాధ్యాయుడును ఇస్తారు. ఇతర భాషామాధ్యమ పాఠశాలల్లో 50మంది లోపు విద్యార్థులు ఉంటే వాటిని హేతుబద్దీకరిస్తారు. ప్రతి పాఠశాలలోనూ అయా భాషల పాఠశాల సహాయకులను ఉంచుతారు.
0 comments:
Post a Comment